తుంకుంటలోని జడ్పీ హైస్కూల్ గ్రౌండ్ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పురుషుల ఖో ఖో శిక్షణ శిబిరం జిల్లా కోకో సంఘం ఉపాధ్యక్షుడు గుర్రం సత్తిరెడ్డి సోమవారం ప్రారంభించారు. పెద్దపల్లిలోని ఇండియా మిషన్ సెకండరీ స్కూల్ గ్రౌండ్ లో వచ్చే నెల 6వ తేదీ నుంచి 9 వరకు జరిగే 58 రాష్ట్రస్థాయి సీనియర్ ఖో ఖో లో పాల్గొనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పురుషుల జట్టుకు పది రోజులపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.