డి.హిరేహాల్ మండలంలోని సోమలాపురం సమీపంలో కారు ద్విచక్ర వాహనాన్ని డీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనం, కారు ముందు బాగాలు నుజ్జు నుజ్జయ్యాయి. ఈసంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన వ్యక్తి కర్నాటక రాష్ట్రం ఉర్తాళ్ గ్రామానికి చెందిన వ్యక్తి అని ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. కారు మైలాపురం గ్రామానికి చెందిన వ్యక్తిదన్నారు.