అక్రమ కేసు అరెస్టులపై పోరాటానికి జగనన్న సైన్యం సిద్ధం : మాజీ ఎమ్మెల్యే శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ కళ్యాణ మండపంలో వైసీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, నాయకుల సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక సమస్యలపై ఉద్యమం ఉద్ధృతం చేసేందుకు గ్రామస్థాయి, వార్డు, మండల కమిటీల నాయకులు, కార్య కర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అక్రమ కేసు అరెస్టులపై పోరాటం చేసేందుకు జగనన్న సైన్యం సిద్ధంగా ఉంటుందన్నారు.