నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని జలకనూరు గ్రామంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ABM చర్చి సంఘ కాపరుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కబడ్డీ పోటీలలో 44 జట్లు పాల్గొని రెండు రోజులపాటు పోటీలు నిర్వహించారు,గురువారం రాత్రి హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోటీల్లో నెహ్రూ నగర్ జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, బేతంచెర్ల రెండో స్థానంలో నిలిచింది, మూడో స్థానంలో వెలుగోడు జట్టు నిలబడక నాలుగో స్థానంలో నెహ్రు నగర్ రెండవ జట్టు గెలిచింది, ABM సంఘ కాపరుల ఆధ్వర్యంలో గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేశారు,