అర్ధవీడు మండలం మాగుటూరు గ్రామంలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఓ పొగాకు పొలంలో 7 గంజాయి మొక్కలను గుర్తించిన ఎక్సైజ్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని సంబంధిత రైతును ప్రశ్నిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో గంజాయి నిర్మూలించేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు అన్నారు.