పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పోలీసులు ఓల్డ్ నేరేడుమెట్ జెడ్పిహెచ్ఎస్ రాజధాని స్కూల్ విద్యార్థులతో సైకిల్ ర్యాలీని నిర్వహించారు. సమాజం కోసం పోలీసులు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేరేడ్మెట్ సీఐ, స్టాఫ్ తో 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వినాయక నగర్ నుంచి నేరేడుమెట్ ఎక్స్ రోడ్డు వరకు ర్యాలీ కొనసాగింది.