మార్కాపురం జిల్లా కంభం మండలం ఎర్రబాలెం గ్రామంలో బుధవారం పేకాట ఆడుతున్న ఆరుగురిని స్థానిక ఎస్సై శివకృష్ణారెడ్డి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2,900 నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్య నేరమని హెచ్చరించారు.