యర్రగొండపాలెం: కళా ఉత్సవాలలో ప్రతిభ చూపిన విద్యార్థిని శైలజాను అభినందించిన ఎంఈఓ మల్లికార్జున నాయక్
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని బొందలపాటి శైలజ మైనంపాడు డైట్ కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి కళా ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజ సోలో సింగింగ్ లో రెండవ స్థానం సాధించారు. దీంతో ఆ విద్యార్థిని మండల విద్యాశాఖ అధికారి తులసి మల్లికార్జున నాయక్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీనివాసులు పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.