ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో సోమవారం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై పోలీసులు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం వల్ల కలుగు అనర్ధాలు మరియు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డుకు తల బలంగా తగలడం వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని పోలీసులు వాహనదారులకు తెలిపారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలపై ప్రయాణించాలని పోలీసులు కోరారు.