ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం రామయపాలెం, పోలిరెడ్డి పాలెం, జగ్గరాజుపాలెం గ్రామాలకు చెందిన రైతులు 1584 పొగాకుబేళ్లు అమ్మకానికి తీసుకురాగా.. 1074 బేళ్లు మాత్రమే కొనుగోలు చేసి 510 బేళ్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. వేలం కేంద్రం కొనుగోలు చివరలో మూడవ వంతు తిరస్కరణ గురి కావటం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి ఈ పొగాకును ఈ ఏడాది కొనుగోలు చేయకపోతే ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు.