పీలేరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని 223మంది అంగన్వాడీ కార్యకర్తలకు సిడిపిఓ రాజమ్మ ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్ పురం రామమూర్తి పీలేరు పంచాయతీ కార్యాలయంలో 5జి స్మార్ట్ ఫోన్లు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వం నుంచి గర్భిణీ స్త్రీలకు, బిడ్డలకు పాలిచ్చే తల్లులకు, పిల్లలకు అందిస్తున్న మెరుగైన సేవలు, పథకాలను ప్రభుత్వానికి తెలియజేయడానికి అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం అందించిన 5జి స్మార్ట్ ఫోన్లు ఎంతో ఉపయోగకరమన్నారు.