మేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడార్ ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయన్న అబద్ధపు నమ్మకంతో నిర్మానుష్య ప్రదేశంలో అక్రమంగా తవ్వకలు జరిపిన 8 మందిని సిఐ రాజు వర్మ బృందం అదుపులోకి తీసుకుంది. వీరి వద్ద నుంచి కారు, రెండు బైకులు, మొబైల్స్ తో పాటు గవ్వలు, పూజ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.