తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలోని మెయిన్ బజార్లో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. కొన్ని సమస్యలను దశలు వారుగా పరిష్కారం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.