జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారణకు బ్లాక్ స్పాట్ ప్రాంతాలపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం జిల్లా ఎస్పీ మరియు నేషనల్ అధారిటీ అధికారులు కలసి NH-16 పై గల మద్దిపాడు గ్రోత్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదాలు సంభవించే బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. స్థానిక పోలీసు మరియు ఇతర శాఖల అధికారులతో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి వారికి పలు సూచనలు తెలియచేసినారు.మద్దిపాడు మండలం, గ్రోత్ సెంటర్ వద్ద బ్లాక్ స్పాట్ ను మరియు వెల్లంపల్లి వద్ద పరిశీలించి, బ్లాక్ స్పాట్ ఉన్న ప్రదేశాల వాహనాలు యొక్క వేగమును నియత్రించేలా సూచన బోర్డులను ఏర్పాటు చేశారు