తాడిపత్రిలోని అతి పురాతనమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజైన గురువారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చనలు, అభిషేకాలు, హారతుల తోపాటు భస్మాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ముఖ్యంగా మహిళా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయం తోపాటు ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. జై రామలింగేశ్వర స్వామి అంటూ నినాదాలు చేశారు. రామలింగేశ్వర స్వామి నామస్మరణలతో ఆలయం మారుమోగిపోయింది. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.