ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో రోడ్డు ప్రమాదాలపై బుధవారం అవగాహన కల్పించారు. సంక్రాంతి పండుగకు తమ గ్రామాలకు వెళ్లే ప్రజలు లేదా ఇతర ప్రాంతాల్లో నుంచి తమ ప్రాంతాలకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా రోడ్డు ప్రమాదాల నివారణకు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని పోలీసుల సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని కారు నడిపే ప్రతి ఒక్కరు సీటు బెల్ట్ ధరించాలని పోలీసులు వెల్లడించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.