రాజంపేట డంపింగ్ యార్డ్ వద్ద శుక్రవారం చెత్త నిండుగా తీసుకు వెళ్లడం వల్ల తన ఆటో బోల్తా పడిందని మున్సిపల్ కార్మికుడు ఆరోపించారు. కమిషనర్ చెత్తను నిండుగా తీసుకెళ్లాలని ఆదేశిస్తున్నారని తెలిపారు. ప్రమాదం జరిగితే తమ కుటుంబ బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. ఉన్నత అధికార జోక్యం చేసుకొని తమపై ఒత్తిడి తగ్గించాలని ఆయన కోరారు.