నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నరసాపురంలోని పెట్రోల్ బంకు వద్ద బుధవారం పెను ప్రమాదం తప్పింది, ట్రాక్టర్ కు డీజిల్ పట్టించుకునేందుకు వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్లే క్రమంలో హఠాత్తుగా రక్తపోటు బిపి డౌన్ కావడంతో ట్రాక్టర్ పెట్రోల్ పంపులు ఢీ కొట్టింది, ఈ ఘటనతో పెట్రోల్ బంకులోని సిబ్బంది భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు, అదృష్టవశాత్తు ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు