కిరాణా దుకాణంలో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం కెరమెరిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం ఇంద్రవెల్లికి చెందిన పడ్ బాలు (45), గత రెండేళ్ల క్రితం కుటుంబంతో కలిసి కెరమెరిలో నివాసం ఉంటున్నారు. కిరాణా దుకాణం నిర్వహిస్తు జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం రాత్రి 8గంటలకు దుకాణంలోనే ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.కుమార్తెకు నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. వ్యాపారి ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.