గన్నవరం: గన్నవరంలో ఉద్యోగినిపై విద్యార్థులు దాడి అవాస్తవం'
గన్నవరం మండలం గొల్లనపల్లి ఉన్నత పాఠశాల బాలుర వసతి గృహంలో ఉద్యోగిని కాశిమ్మపై విద్యార్థులు మద్యం మత్తులో దాడి చేశారన్న వార్తలు అవాస్తవమని సాంఘిక సంక్షేమ శాఖ అధికారి షాహిద్ బాబు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన బృందం విద్యార్థులు మద్యం తాగలేదని, కేవలం వాగ్వాదం మాత్రమే జరిగిందని నిర్ధారించింది. అయితే, కాశిమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.