కడప జిల్లా జమ్మలమడుగు మండలం లోని ప్రొద్దుటూరు రహదారిలోని దానవులపాడు గ్రామం దగ్గర సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో అదే గ్రామానికి చెందిన ఆవుల బాలయ్య (56) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మార్గమధ్యలోనే మృతి చెందాడని స్థానికులు తెలిపారు.మృతునికి ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నట్లు తెలుస్తుంది.ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.