జిల్లా వ్యాప్తంగా పోలీసులు శుక్రవారం పలు కిరాణా వ్యాపార దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీపావళి టపాసులను అక్రమంగా నిలువ ఉంచిన వాటిని గుర్తించాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ పలు దుకాణాలను తనిఖీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. తాత్కాలిక అనుమతులతో ప్రభుత్వానికి రుస్తువు చెల్లించి దీపావళి ముందు సామాగ్రి విక్రయించుకోవాలని అలా కాకుండా నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని దుకాణదారులను పోలీసులు హెచ్చరించారు.