అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం నిమ్మలపాలెం గ్రామంలో జరిగిన అగ్రి ప్రమాదంలో తల్లి కూతురు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు దీనికి సంబంధించిన వివరాలు 108 సిబ్బంది తెలిపారు. గ్రామంలో ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించగా మంటలు చెలరేగాయని తెలిపారు. ఇంట్లో ఆరు సంవత్సరాల సాయి పల్లవి అనే అమ్మాయి ఉండిపోవడంతో తల్లి గాయత్రి పరుగు పరుగున ఇంట్లోకి వెళ్లి తీసుకువచ్చే సమయంలో మంటల తాకిడికి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. వీరిద్దరిని 108 లో రాజమండ్రి ఆసుపత్రికి తీసుకు వెళ్లే లోపు మృతి చెందినట్లు తెలిపారు.