నంద్యాల జిల్లాలోనీ ప్రభుత్వ ,ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు ఈనెల 10వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను డిఇఓ జనార్దన్ రెడ్డి ప్రకటించారు సంక్రాంతి సెలవు దినాలలో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ జరపడం జరుగుతుందని,పదవ తరగతి విద్యార్థులకు తప్ప మిగతా తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ ఉండవని తెలిపారు.ప్రభుత్వ ,ప్రైవేటు అన్ని పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా సెలవు దినాల్లో స్కూలు నిర్వహిస్తే అటువంటి స్కూల్లో పై తగిన చర్యలు తీసుకోబడుతుందని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది.