అర్హత లేని వారిని ఆడిస్తున్నారని, డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వని వారిని సెలెక్షన్ నుండి తొలగిస్తున్నారని బాధితుల ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు ఐదుగురు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జూనియర్ సెలక్టర్ల పై కేసు నమోదు చేశారు. కోట రామారావు అనే వ్యక్తి రాచకొండ సిపికి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. తన కుమారుడు రాహుల్ కార్తికేయ అండర్ 16, అండర్ 19, అండర్ 23 లీగ్ లలో ప్రతిభ కనబరిచిన, సెలక్షన్ కమిటీ డబ్బులు అడిగితే ఇవ్వనందున అతని సెలెక్షన్ నుండి తొలగించారని కోట రామారావు ఆరోపించారు.