ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బిల్డింగ్ డివిజన్ డిఇ శ్రీనివాస్, రెండు నెలల్లో పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో, సివిల్ కాంట్రాక్టర్ వద్ద 11వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్డి హండ్రెడ్గా దొరికిపోయారు. మానేరు హాస్టల్ లో సివిల్ పనులు చేసిన కాంట్రాక్టర్, 14 లక్షల బిల్లు పాస్ చేయించుకోవడానికి ఈ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. గత వారం ఐదువేల రూపాయలు ఫోన్పే ద్వారా ఇచ్చిన కాంట్రాక్టర్, మిగిలిన 6000 రూపాయల కోసం డిఈ శ్రీనివాస్ ఒత్తిడి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.