టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో వందలాది ఉత్తీర్ణత లక్ష్యంగా వందరోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూ ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నట్లు రాయదుర్గం MEO ఇర్షాద్ తెలిపారు. మంగళవారం రాత్రి చదం గ్రామలో టెన్త్ విద్యార్థుల ఇళ్లవద్దకు వెళ్లి ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులతో ఆరా తీశారు. ఎంఈవో మాట్లాడుతూ మండలంలో 17 పాఠశాలల్లో 1200 మంది విద్యార్థులు ఉన్నారని చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.