ఆలూరు: దేవనకొండలో గుడిసె వర్షానికి కూలిపోవడంతో మహిళ ఆవేదన
Alur, Kurnool | Oct 6, 2025 దేవనకొండలో నివసిస్తున్న నరసమ్మ పూరి గుడిసె వర్షానికి కూలిపోయింది. దీంతో పాటు చుట్టు పక్కల నీరు చేరడంతో దుర్భర జీవితం గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆమె మాట్లాడుతూ.. 'శాశ్వత నివాసం లేదు. ఈ గుడిసె కూడా వర్షంలో కూలిపోయింది. తినడానికి కూడా తిండి దొరకడం లేదు' అంటూ ప్రభుత్వ సహాయం కోరింది.