మార్కాపురం జిల్లాగా ఏర్పడిన సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కంటతడి పెట్టారు.నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించను అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 66 రోజులపాటు తను చేసిన ఉద్యమాన్ని సీఎం చంద్రబాబు గుర్తించి జిల్లా ప్రకటించారని భావోద్వేగానికి లోనయ్యారు. త్వరలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి సీఎం చంద్రబాబకు అక్కడే గుడి కట్టిస్తానని అన్నారు. మార్కాపురం జిల్లా మొదటి ఇన్చార్జి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని రాజబాబు అన్నారు. ఎన్నో ఏళ్లుగా పశ్చిమ ప్రాంత ప్రజలు పోరాడి సీఎంను ఒప్పించుకొని తెచ్చుకున్న జిల్లాను అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని కలెక్టర్ అన్నారు.