సూపర్ జిఎస్టీ - సూపర్ సేవింగ్స్ లో భాగంగా ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువుకట్ట వద్దనున్న షిర్డీసాయి కళ్యాణ మండపంలో అక్టోబర్ 14 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన ద గ్రేట్ అనంతపూర్ షాపింగ్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూపర్ జిఎస్టీ - సూపర్ సేవింగ్స్ లో భాగంగా ధరల తగ్గింపుపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కేశవ నాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస యాదవ్ తదితరులు పాల్గొన్నారు.