ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో లబ్ధిదారులకు మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి ఎగ్ కార్ట్స్ పంపిణీ చేశారు. తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ, పేదరిక నిర్మూలన సంస్థ మరియు ఎన్.ఈ.సీ.సి సహకరంతో వీటిని అందజేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్వామి తెలిపారు.