పెద్దపప్పూరు మండలం పసులూరు గ్రామంలో పొలం గట్టు విషయంపై దళితుడు పెద్ద ఈరన్నపై ఇదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బాలసుబ్బయ్య దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. పొలం గట్టు విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపంతో బాలసుబ్బయ్య కట్టెతో పెద్ద ఈరన్నపై దాడి చేశాడు. దాడిలో పెద్ద ఈరన్న తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.