ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముస్లింల పక్షపాతి అని మరోసారి నిరూపించారని ఏపీ రాష్ట్ర టీడీపీ మైనారిటీ ఉపాధ్యక్షుడు షేక్ సందని బాషా అన్నారు. మౌజనులకు రెండో విడతగా రూ. 90 కోట్లు వేతనాల కోసం సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి రోజున నిధులు విడుదల చేయడంపై సంతోషం వ్యక్తం చేసిన సందని బాషా, టీడీపీలోని మైనార్టీ నాయకులు కూడా ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.