అనంతపురం జిల్లా ఎస్ఆర్ఐటి కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య
Anantapur Urban, Anantapur | Sep 16, 2025
అనంతపురం జిల్లాలోని రోటరీ పురం సమీపంలో ఉన్న ఎస్ఆర్ఐటి కళాశాలలో మూడవ సంవత్సరం బిటెక్ చదువుతున్న ధనలక్ష్మి (20) అనే విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీంతో మృతదేహాన్ని అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.