నంద్యాల జిల్లా దొర్నిపాడు మండల కో ఆప్షన్ నెంబర్ గా షఫీ భాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, గురువారం దొర్నిపాడు మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కో ఆప్షన్ ఎన్నికల కార్యక్రమంలో షఫీ భాషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ఈ ఎన్నికకు ప్రొసీడింగ్ ఆఫీసర్ గా గోవింద్ నాయక్ వ్యవహరించగా, ఎంపీడీవో శివప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు, ఎన్నికల్లో ముగ్గురు నామినేషన్ వేయగా ఇరువురి నామినేషన్లు తిరస్కరించారు, దీంతో షఫీ భాష ఎన్నిక ఏకగ్రీవమయింది