యర్రగొండపాలెం: దోర్నాల మండలంలోని చిన్న దోర్నాల వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, ఇద్దరికీ తీవ్ర గాయాలు,ఆగకుండా వెళ్ళిపోయిన కారు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని చిన్న దోర్నాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరినీ గుర్తుతెలియని కారు ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఘటనలో వెంగల్రెడ్డి ఏడుకొండలు అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లినట్లుగా బాధితులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.