ఆందోల్: రాయికోడ్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ పారితోష్ పంకజ్
శనివారం రాయికోడ్ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, స్టేషన్ కు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు.