అనంతపురం జిల్లా నార్పల మండలం నాయన పల్లి లో ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఆర్డిటి స్థలం కోసం రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో నాయనపల్లి కి చెందిన వెంకటరాముడుకు తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న వెంకట్ రాముడు ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో సింగనమల సీఐ కౌలుట్లయ్య, ఎస్సై సాగర్ విచారణ చేశారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేశామని సీఐ కౌలుట్లయ్య తెలిపారు.