యాడికిలోని ప్రభుత్వ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠకులు పుస్తక ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి మధుసూదన్, పోస్ట్మాస్టర్ రామాంజనేయులు మాట్లాడారు.విద్యార్థులు తప్పకుండా గ్రంథాలయాలను ఆశ్రయించాలన్నారు. గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందిస్తాయన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.