అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లాలోని ప్రజలను హెచ్చరిస్తున్నారు. బండ్లమూడి గ్రామంలో రెండు రోజుల క్రితం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని పలువురికి గాయాలయ్యాయి. పొలం వివాదం నేపథ్యంలో ఈ ఘర్షణ చోటు చేసుకోగా అప్పటినుంచి పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో గ్రామంలో పీకెట్ ఏర్పాటు చేశారు. గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు.