కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కర్మాన్ఘాట్ లోని హనుమాన్ దేవాలయం శ్రీ హరి హర క్షేత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఎంపీ ఈటల రాజేందర్ బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పరమ పవిత్రమైన రోజు అని ప్రజలందరికీ జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆంజనేయస్వామి అయ్యప్పస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.