ప్రకాశం జిల్లా దర్శి ఎన్ఎస్పి ఇన్చార్జి ఈఈ విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఈమె ప్రస్తుతం త్రిపురాంతకం డిఈగా పని చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దర్శి ఎన్ఎస్పి ఇన్చార్జి ఈఈ గా విజయలక్ష్మి ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది విజయలక్ష్మి కి ఘన స్వాగతం పలికారు. ప్రజలకు అందుబాటులో ఉండి నీటి సమస్య లేకుండా తన వంతు బాధ్యతగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.