రాష్ట్రంలో ఐదుగురు కలెక్టర్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కోటపాడుకు చెందిన కలెక్టర్ గంధం చంద్రుడుకు (2010 బ్యాచ్) కార్యదర్శిగా పదోన్నతి లభించింది. కాగా.. ప్రస్తుతం గంధం చంద్రుడు రాష్ట్ర కార్మిక శాఖ అదనపు కార్య దర్శి హోదాలో పనిచేస్తున్నారు.