ప్రకాశం జిల్లా గిద్దలూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ను గురువారం ఏపీ ఆర్టీసీ ఎండి ద్వారకాతిరుమలరావు స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డితో కలిసి సందర్శించారు. బస్టాండ్ అభివృద్ధిపై చర్చించిన ఎండి మూడు నెలలలో బస్టాండ్ అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం చక్కగా అమలు అవుతుందని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు.