రాయదుర్గం: గరుడచేడు వద్ద వేరుశనగ నూర్పిడి యంత్రం పల్టీ కొట్టిన ఘటనలో ఒక మహిళా కూలీ మృతి, తీవ్రంగా గాయపడిన మరో నలుగురు
కణేకల్లు మండలంలోని గరుడచేడు గ్రామ సమీపంలో వేరుశెనగ నూర్పిడి యంత్రం పల్టీ కొట్టిన ఘటనలో ఒక మహిళా కూలీ మంతి చెందగా నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. తుంబిగనూరు గ్రామానికి చెందిన ఈ యంత్రాన్ని గరుడచేడు గ్రామంలో ఓ రైతు పొలంలో నూర్పిడి చేసేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన ఇద్దరినీ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి, మరో ఇద్దరిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.