ప్రకాశం జిల్లా పొదిలి మండలం సలకనూతల గ్రామంలో మంగళవారం విద్యుత్ షాక్ తో తండ్రి కొడుకులు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకొని భారీ వర్షంలో సలక నూతల గ్రామానికి ట్రాక్టర్ ఫై తండ్రి కొడుకులు బయలుదేరారు. ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో తండ్రి పెద్దకోటయ్య కొడుకు వెంకటేశ్వర్లు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.