మార్కాపురం మండలం గజ్జలకొండ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల పక్కన యువకుడు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. స్థానికులు మొద్దులపల్లి కి చెందిన శివగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి మొండెం మాత్రమే ఉంది తలభాగం కనబడలేదు. రైల్వే పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. కానీ తల దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ఆరోపించారు.