యాడికి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 1974-75లో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం తాము చదువుకున్న పాఠశాల వేదికగా కలుసుకున్నారు. ఒకరినొకరు చూసుకొని మురిసిపోయారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు. చిన్నపిల్లల్లా మారిపోయారు. ఒకరినొకరు కుటుంబ నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అన్నీ మరిచిపోయి సంతోషంగా గడిపారు.