పొదలకూరు మండలం తాటిపర్తి లోని మాతమ్మ ఆలయంలో ఆదివారం దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గుడిలోకి ప్రవేశించి హుండీని పగలగొట్టారు. హుండీలో ఉన్న నగదు కొంత సామానులు దోచుకెళ్ళినట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు. ఉదయం పూజారులు గుడి తలుపులు తెరిచే సమయంలో ఈ ఘటన బయటపడింది. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు..