వనపర్తి జిల్లా మదనాపురం మండలం కేంద్రంలో ఆదివారం బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలిసి మార్నిగ్ వాక్ కార్యక్రమంను ప్రారంభించారు.స్థానిక శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు సంఘ నాయకులు రాచాలా ను సన్మానించారు. మండల కేంద్రంలో, మాదిగ రైల్వే స్టేషన్ లో పర్యటించి ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.